ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : బోనాలకొచ్చి మద్యం తాగి నిద్రపోయిన మహిళ.. తెల్లారేసరికి బాత్రూమ్‌లో...!

ABN, First Publish Date - 2021-07-29T18:18:36+05:30

కుమార్తెకు 2019లో దమ్మాయిగూడకు చెందిన సాగర్‌తో వివాహం అయింది. లాక్‌డౌన్‌ కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బోయిన్‌పల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. బోయిన్‌పల్లి కోయబస్తీకి చెందిన చిత్తారి సునీత(45) రోజువారి కూలీ. ఆమె భర్త యాదగిరి పదేళ్ల క్రితం చనిపోయాడు. సునీతకు కుమార్తె ప్రసన్నలక్ష్మి, కుమారులు భరత్‌, సాయి ఉన్నారు. కుమార్తెకు 2019లో దమ్మాయిగూడకు చెందిన సాగర్‌తో వివాహం అయింది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు దొరకక ఆర్థిక ఇబ్బందులతో సునీత మద్యానికి బానిసయింది. మంగళవారం బోనాల పండుగకు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చింది. మద్యం తాగి పిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది.


బుధవారం తెల్లవారు జామున ప్రసన్నలక్ష్మి బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు లేవగా తల్లి సునీత ఇంటి పైకప్పు ఇనుపరాడ్డుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమె వెంటనే సోదరుడిని నిద్ర లేపి కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అంత్యక్రియలను ఆపేశారు.  మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-29T18:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising