నడిరోడ్డుపై యువకుడిని పొడిచి చంపిన యువతి
ABN, First Publish Date - 2021-01-12T13:49:01+05:30
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని తన మాట వినలేదన్న కారణంగా నడిరోడ్డుపై ఓ యువతి పొడిచి చంపేసింది. తాడేపల్లిగూడేనికి చెందిన తాతాజీనాయుడు కొన్నాళ్ల కిందట పెద్దలకు తెలియకుండా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులుగా సదరు యువతి అందరికీ తెలిసేలా మళ్లీ పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎన్నిసార్లు అడిగినా తాతాజీనాయుడు మాత్రం దాటవేస్తూ వచ్చాడు. యువకుడు నిరాకరించడంతో సదరు యువతి.. తాతాజీనాయుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేసింది. కాపవరం-ధర్మవరం మధ్య ఘటన చోటు చేసుకుంది.
Updated Date - 2021-01-12T13:49:01+05:30 IST