ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తతో వివాదం.. బయటకు వెళ్లి, మర్నాడు తిరిగొచ్చిన భార్య.. ఆమెను చూసిన భర్త ఆగ్రహంతో ఊగిపోతూ ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2021-10-11T16:24:12+05:30

బీహార్‌లోని బేతియాలో దారుణం వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్‌లోని బేతియాలో దారుణం వెలుగు చూసింది. భర్త తన భార్యను ఇటుకతో మోది హత్యచేశాడు. బైరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బలువా రమ్పుర్వా పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని గొడవల కారణంగా అత్తింటివారు కోడలిపై కర్రలతో దాడి చేశారు. ఇదే సమయంలో ఆ మహిళ భర్త ఇటుకతో ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. నిందితుడు అశోక్ మహ్తోను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 


మృతురాలిని గీతాదేవి(40)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం భార్యాభర్తల మద్య ఏదో విషయమై వివాదం జరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లేందుకు బయలుదేరింది. ఇంతలో ఏమనున్నదో ఏమో గ్రామంలోనే తెలిసినవారి ఇంటిలో తలదాచుకుంది. మర్నాటి ఉదయం అత్తారింటికి చేరుకుంది. ఆమెను చూడగానే అత్తవారింటిలోని వారంతా ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంతలో భర్త ఒక ఇటుక తీసుకువచ్చి ఆమె తలపై మోదాడు. దీంతో గీతాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రామస్తులు గీతాదేవి పుట్టింటివారికి ఫోనులో తెలియజేశారు. వెంటనే వారంతా గీతాదేవి ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో గీతాదేవి అత్తింటివారు గ్రామం నుంచి పరారయ్యారు. గీతాదేవి పుట్టింటివారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-11T16:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising