ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: కదులుతున్న రైలులో మహిళపై 8మంది అత్యాచారం

ABN, First Publish Date - 2021-10-09T17:58:34+05:30

కదులుతున్న రైలులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన శనివారం వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కదులుతున్న రైలులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన శనివారం వెలుగుచూసింది.లక్నో-ముంబై వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఇగత్‌పురి స్టేషన్ నుంచి బయలుదేరినప్పుడు ఈ దారుణ సంఘటన జరిగింది. ముంబై వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళపై 8 మంది కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు.పుష్పక్ రైలు కంపార్టుమెంటులోకి 8మంది బలవంతంగా ప్రవేశించి కత్తులు చూపించి 20మంది ప్రయాణికులను దోచుకున్నారు.ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.


రైలులో ఉన్న 30 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై 8మంది దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు. బాధిత మహిళకు గాయాలయ్యాయి.అరగంట పాటు నిందితులు మహిళపై అఘాయిత్యం చేశారు. రైలు కాసర స్టేషనుకు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు శనివారం తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-09T17:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising