ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-03-01T17:31:13+05:30
హైదరాబాద్: రాజేంద్రనగర్ గంధంగూడా వీకర్ సెక్షన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. దివ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: రాజేంద్రనగర్ గంధంగూడా వీకర్ సెక్షన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. దివ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాత్ రూమ్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువతి ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్లోనే దివ్య కాలి బూడిదైంది. దివ్య ఆత్మహత్యోదంతం ఆమె తల్లిదండ్రులను కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారాణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Updated Date - 2021-03-01T17:31:13+05:30 IST