ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్ స్టేషన్‌లో కిరాతకం.. మహిళపై మూడు రోజులుగా ఎస్సై అత్యాచారం

ABN, First Publish Date - 2021-03-08T22:06:43+05:30

రాజస్థాన్‌లో ఓ ఎస్సై పోలీస్ స్టేషన్‌లోనే దారుణానికి తెగబడ్డాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై పోలీస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్వార్: రాజస్థాన్‌లో ఓ ఎస్సై పోలీస్ స్టేషన్‌లోనే దారుణానికి తెగబడ్డాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై పోలీస్ స్టేషన్‌లో మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అల్వార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం..  అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ 2018లో భర్తపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా, మహిళ భర్త విడాకులకు సిద్ధం కాగా, ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో మహిళ ఈ నెల 2న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కలిసినట్టు అల్వార్ ఎస్పీ తెలిపారు. 


ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనపై మధ్య వయసులో ఉన్నఎస్సై మార్చి 2 నుంచి మూడు రోజులపాటు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని, నిందితుడు సింగ్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నట్టు చెప్పారు. ఎస్సైకి, బాధిత మహిళకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డును కూడా ఆమె అందించినట్టు తెలిపారు.  


నిందితుడిని సస్పెండ్ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఐజీ నుంచి ఆదేశాలు అందినట్టు ఎస్పీ వివరించారు. బాధిత మహిళ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-03-08T22:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising