విషవాయువు సోకి మామాఅల్లుళ్ల మృతి
ABN, First Publish Date - 2021-11-14T15:45:37+05:30
పొలంలో విషవాయువు సోకి మామాఅత్తుళ్లు మృతిచెందారు. రాణిపేట జిల్లా ఓచ్చేరి సమీపం అవలూరు కరివేడు గ్రామానికి చెందిన రైతు మణి (52) అల్లుడు సుభాష్ (24) మామాఅల్లుళ్లు. చిత్తాంజి
వేలూరు(Chennai): పొలంలో విషవాయువు సోకి మామాఅత్తుళ్లు మృతిచెందారు. రాణిపేట జిల్లా ఓచ్చేరి సమీపం అవలూరు కరివేడు గ్రామానికి చెందిన రైతు మణి (52) అల్లుడు సుభాష్ (24) మామాఅల్లుళ్లు. చిత్తాంజి గ్రామంలోని రైతు శివకు చెందిన భూమిని మణి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మణి, సుభాష్లు పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ బావిలో విద్యుత్ మోటారు అమర్చే క్రమంలో విషవాయువు సోకి స్పృహ తప్పి పడిపోయారు. రాత్రి 11 గంటలైనా వారు ఇంటికి రాకపోవడంతో బంధువులు పొలానికి వెళ్లి చూడగా, బావిలో ఇద్దరు అచేతనంగా పడిఉండడం గమనించి రాణిపేట అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు చేరుకొని వారిద్దరినీ వెలుపలికి తీయగా, అప్పటి వారు మృతిచెందినట్లు గుర్తించారు
Updated Date - 2021-11-14T15:45:37+05:30 IST