ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో పెళ్లికి యత్నించిన భర్తను చంపిన భార్య

ABN, First Publish Date - 2021-06-26T15:05:38+05:30

మూడో పెళ్లికి యత్నించిన భర్త పురుషాంగాన్ని భార్య కోసి చంపిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రహంతో పురుషాంగం కోసిన వైనం 

ముజఫర్‌నగర్ (ఉత్తరప్రదేశ్): మూడో పెళ్లికి యత్నించిన భర్త పురుషాంగాన్ని భార్య కోసి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ లో జరిగింది. షికార్ పూర్ గ్రామానికి చెందిన మతాధికారి మౌల్వీ వకీల్ అహ్మద్ కు ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్నాడు. 57 ఏళ్ల అహ్మద్ మరో మహిళను మూడో వివాహం చేసుకోవాలకుంటున్నానని చెప్పాడు. దీంతో అహ్మద్ రెండవ భార్య హాజ్రా మూడో పెళ్లి చేసుకోవద్దని భర్తను కోరింది. భార్య హాజ్రా చేసిన వినతిని భర్త పెడచెవిన పెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 


అనంతరం రాత్రి మౌల్వీ అహ్మద్ నిద్రలో ఉన్నపుడు హాజ్రా వంటగదిలోని కత్తితో భర్త పురుషాంగాన్ని కోశారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయి అహ్మద్ మరణించాడు. నిందితురాలు తన బంధువుల సహాయంతో భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు వచ్చి ప్రశ్నించగా తానే హతమార్చానని భార్య అంగీకరించింది. దీంతో పోలీసులు హాజ్రాపై కేసు నమోదు చేసి, అహ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-06-26T15:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising