ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎంసీ కార్యకర్తపై కాల్పులు... బాంబు దాడిలో ముగ్గురికి గాయాలు!

ABN, First Publish Date - 2021-02-24T11:51:34+05:30

పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ పరిధిలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిడ్నాపూర్: పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ పరిధిలోని మకర్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తలపై దాడి జరిగింది. మంగళవారం రాత్రి 10 గంటలకు తుపాకీ కాల్పులతో పాటు బాంబు దాడి చోటుచేసుకుంది. దీంతో ఈ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. తుపాకీ తూటాలకు ఒక టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. 


బాంబు దాడిలో మరో ముగ్గురు కార్యర్తలు గాయపడ్డారు. బాధితులను మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు అజీత్ మౌతీ స్పందిస్తూ టీఎంసీ కార్యకర్తల్లోని రెండు గ్రూపుల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నదని పేర్కొన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం టీఎంసీకి చెందిన నలుగురు కార్యకర్తలు రోడ్డు పక్కగా కూర్చున్నారు. ఇదే సమయంలో ఫైరింగ్ జరగడంతో పాటు బాంబు దాడి కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. తుపాకీ తూటాలకు టీఎంసీ కార్యకర్త సైవిక్ దలాయీ(28) మృతి చెందాడు.

Updated Date - 2021-02-24T11:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising