గోవాలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-06-30T12:23:44+05:30
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గోవాలో జరిగింది...
పనాజీ (గోవా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గోవాలో జరిగింది. గోవాలోని జౌరీనగర్ అమన్ కాలనీలో ఓ మహిళతో సహా ముగ్గురు కుటుంబసభ్యులు ఉరి వేసుకున్నారు. మంగళవారం రాత్రి అమన్ కాలనీకి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన అమన్ కాలనీలోని ఇంటికి వచ్చి చూడగా ముగ్గురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.ముగ్గురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆత్మహత్య కింద కేసు నమోదు చేశామని, ఆత్మహత్యకు కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని గోవా పోలీసు అధికారి వేమ చెప్పారు. three Members Of Goa
Updated Date - 2021-06-30T12:23:44+05:30 IST