ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటాడిన మృత్యువు.. ముగ్గురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-04-12T21:01:10+05:30

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు అంటారు.. ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. కారు పంక్చర్ అయిందని దిగి రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తుల్ని ట్రక్కు రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు అంటారు.. ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. కారు పంక్చర్ అయిందని దిగి రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తుల్ని ట్రక్కు రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా హైవేపై ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులంతా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కారులో న్యూఢిల్లీ నుంచి జాన్సీ బయలుదేరారు. జాతీయ రహదారి 2 వద్దకు రాగానే ఓ దాబా వద్ద వాళ్ల కారు పంక్చర్ అయింది. దీంతో వాళ్లు కారులో నుంచి దిగి రోడ్డు పక్కన కూర్చున్నారు. అంతలోనే అక్కడికి దూసుకొచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.


Updated Date - 2021-04-12T21:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising