శ్రీలంకకు తరలిస్తున్న 96 కిలోల గంజాయి స్వాధీనం
ABN, First Publish Date - 2021-11-06T15:11:56+05:30
నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద నాటుపడవలో శ్రీలంకకు తరలిస్తున్న 96 కేజీల గంజాయిని పోలీసు లు స్వాధీనం చేసుకుని ఓ యువకుడిని అరెస్టు చేశారు. వేదారణ్యం సమీపం పుష్పవనం జాలర్ల కాలనీలో గంజాయి స్మగ్లింగ్
చెన్నై(Chennai): నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద నాటుపడవలో శ్రీలంకకు తరలిస్తున్న 96 కేజీల గంజాయిని పోలీసు లు స్వాధీనం చేసుకుని ఓ యువకుడిని అరెస్టు చేశారు. వేదారణ్యం సమీపం పుష్పవనం జాలర్ల కాలనీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సముద్రతీర భద్రతా దళం గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో నిఘా వేశారు. ఆ సమయంలో సముద్రతీరంలో నాటు పడవలోని వలలో మూడు బస్తాలుండడం, అందులో ఓ యువకుడు సంచరి స్తుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులు ఆ పడవలోని బస్తాలను చూడగా అందులో 96 కేజీల గంజాయి లభించింది. దానిని తరలించేందుకు ప్రయత్నించిన మణికంఠన్ (33) అనే యువకుడిని అరెస్టు చేసి నాటు పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. వేదారణ్యం సముద్రతీర భద్రతాదళం కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.
Updated Date - 2021-11-06T15:11:56+05:30 IST