ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకకు తరలిస్తున్న 96 కిలోల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2021-11-06T15:11:56+05:30

నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద నాటుపడవలో శ్రీలంకకు తరలిస్తున్న 96 కేజీల గంజాయిని పోలీసు లు స్వాధీనం చేసుకుని ఓ యువకుడిని అరెస్టు చేశారు. వేదారణ్యం సమీపం పుష్పవనం జాలర్ల కాలనీలో గంజాయి స్మగ్లింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(Chennai): నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద నాటుపడవలో శ్రీలంకకు తరలిస్తున్న 96 కేజీల గంజాయిని పోలీసు లు స్వాధీనం చేసుకుని ఓ యువకుడిని అరెస్టు చేశారు. వేదారణ్యం సమీపం పుష్పవనం జాలర్ల కాలనీలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు  సమాచారం అందడంతో సముద్రతీర భద్రతా దళం గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో నిఘా వేశారు. ఆ సమయంలో సముద్రతీరంలో నాటు పడవలోని వలలో మూడు బస్తాలుండడం, అందులో ఓ యువకుడు సంచరి స్తుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులు ఆ పడవలోని బస్తాలను చూడగా అందులో 96 కేజీల గంజాయి లభించింది. దానిని తరలించేందుకు ప్రయత్నించిన మణికంఠన్‌ (33) అనే యువకుడిని అరెస్టు చేసి నాటు పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. వేదారణ్యం సముద్రతీర భద్రతాదళం కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.


Updated Date - 2021-11-06T15:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising