యూపీలో మరో దారుణం...
ABN, First Publish Date - 2021-02-22T18:29:33+05:30
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. రాత్రివేళ ఇంటి ముందు నిలబడిన పదహారేళ్ల బాలికను ఇద్దరు యువకులు లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన...
బాలికను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
మహోబా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. రాత్రివేళ ఇంటి ముందు నిలబడిన పదహారేళ్ల బాలికను ఇద్దరు యువకులు లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబాలో జరిగింది. మహోబాలోని తన ఇంటి ముందు రాత్రివేళ పదహారేళ్ల బాలిక నిలబడి ఉండగా, జైహింద్ (23), ఆషిష్ సేన్(22)లు వచ్చి బలవంతంగా ఆమెను పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. బాధిత బాలిక సంఘటన గురించి తన అక్కకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితులైన జైహింద్, ఆషిష్ సేన్ లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
Updated Date - 2021-02-22T18:29:33+05:30 IST