ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని ఢీకొన్న కారు: విద్యార్థిని సహా ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-10-12T15:21:34+05:30

స్థానిక రెడ్‌హిల్స్‌ సమీపం కార్నోడై వద్ద సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్లస్‌-1 విద్యార్థిని సహా ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థిని తీవ్రంగా గాయ పడింది. చోళవరం సమీపం పాడియనల్లూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: స్థానిక రెడ్‌హిల్స్‌ సమీపం కార్నోడై వద్ద సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్లస్‌-1 విద్యార్థిని సహా ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థిని తీవ్రంగా గాయ పడింది. చోళవరం సమీపం పాడియనల్లూరులో నివసిస్తున్న కుమార్‌కు కనిష్క(16), అశ్విద(14) అనే కుమార్తెలున్నారు. కనిష్క పొన్నేరిలోని ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌-1, అశ్విద తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో కనిష్క, అశ్విదలను సోమవారం ఉదయం వారిని బంధువు నాగరాజ్‌ కారులో ఎక్కించుకుని పొన్నేరికి బయల్దేరారు. ఆ కారు రెడ్‌హిల్స్‌ సమీపం కార్నోడై వంతెన వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో కనిష్క, నాగరాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అశ్విదను స్టాన్లీ వైద్యకళాశాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-12T15:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising