లారీని ఢీకొన్న కారు: విద్యార్థిని సహా ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2021-10-12T15:21:34+05:30
స్థానిక రెడ్హిల్స్ సమీపం కార్నోడై వద్ద సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్లస్-1 విద్యార్థిని సహా ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థిని తీవ్రంగా గాయ పడింది. చోళవరం సమీపం పాడియనల్లూరులో
చెన్నై: స్థానిక రెడ్హిల్స్ సమీపం కార్నోడై వద్ద సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్లస్-1 విద్యార్థిని సహా ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థిని తీవ్రంగా గాయ పడింది. చోళవరం సమీపం పాడియనల్లూరులో నివసిస్తున్న కుమార్కు కనిష్క(16), అశ్విద(14) అనే కుమార్తెలున్నారు. కనిష్క పొన్నేరిలోని ప్రైవేటు పాఠశాలలో ప్లస్-1, అశ్విద తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో కనిష్క, అశ్విదలను సోమవారం ఉదయం వారిని బంధువు నాగరాజ్ కారులో ఎక్కించుకుని పొన్నేరికి బయల్దేరారు. ఆ కారు రెడ్హిల్స్ సమీపం కార్నోడై వంతెన వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో కనిష్క, నాగరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అశ్విదను స్టాన్లీ వైద్యకళాశాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2021-10-12T15:21:34+05:30 IST