ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొన్న నువ్వు ఏదో హోటల్ వద్ద కనిపించావట.. ఎందుకెళ్లావు..? అని అడిగిందా తల్లి.. ఆ కూతురు ఏడుస్తూ చెప్పిన నిజాలు విని..

ABN, First Publish Date - 2021-11-18T22:23:35+05:30

ఆ బాలిక నాలుగు రోజుల క్రితం ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ ఆమెను చూసిన వారు తల్లితో చెప్పారు. దీంతో 17 ఏళ్ల ఆ కూతురిని తల్లి హోటల్ వద్ద కనిపించావట.. అక్కడికి ఎందుకెళ్లావు..? అని అడిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: ఆ బాలిక నాలుగు రోజుల క్రితం ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ ఆమెను చూసిన వారు తల్లితో చెప్పారు. దీంతో 17 ఏళ్ల ఆ కూతురిని తల్లి హోటల్ వద్ద కనిపించావట.. అక్కడికి ఎందుకెళ్లావు..? అని అడిగింది. ఆ కూతురు ఏడుస్తూ చెప్పిన నిజాలు విని తల్లి షాకైంది. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి..


గ్వాలియర్‌లోని రాయ్‌సింగ్‌ ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే శివం అలియాస్ కంజా బతమ్ అనే వ్యక్తితో ఆమెకు మూడేళ్లుగా పరిచయం ఉంది. ఆ పరిచయమే కొద్దిరోజుల తర్వాత ప్రేమగా మారింది. బాలిక కుటుంబసభ్యులకు వీరి ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను శివంతో మాట్లాడకూడదని హెచ్చరించారు. దీంతో ఆమె అతడితో మాట్లాడడం తగ్గించింది. కోపంతో రగిలిపోయిన అతడు బాలికతో ఓరోజు గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే నాలుగురోజుల క్రితం శివం ఆమెకు ఫోన్ చేసి తనను ఓసారి కలవాలని, తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటానని కోరాడు. దీంతో బాలిక అతడి మాటల్ని నమ్మి, కలవడానికి హోటల్‌కు వెళ్లింది. 


అక్కడ హోటల్‌లో బాలికకు శివం బాగా తినిపించాడు. ఆ తర్వాత గదికి వస్తే క్షమాపణ అడుగుతానని నమ్మబలికాడు. అతడిని నమ్మి బాలిక గదిలోకి వెళ్లింది. లోపలికి వెళ్లగానే అతడు గది తలుపులు మూసి లాక్ చేశాడు. అపుడు బాలిక అతడిని ఎందుకు తలుపులు మూస్తున్నావ్.. అని ప్రశ్నించగా బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. 


ఈ నెల 13న జరిగిన ఘటనతో తీవ్రంగా భయపడిపోయిన బాలిక నాలుగురోజుల పాటు జ్వరంతో బాధపడింది. అయితే తల్లి హోటల్ దగ్గరికి ఎందుకు వెళ్లావ్ అని అడగ్గా ఆ బాలిక ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆ తల్లి కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ శివంపై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  

Updated Date - 2021-11-18T22:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising