ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితులు బస్సులో.. పోలీసులు విమానంలో.. చివరికి..!

ABN, First Publish Date - 2021-02-23T13:58:03+05:30

. అప్రమత్తమైన పోలీసులు విమానంలో కోల్‌కత్తాకు వెళ్లగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కోల్‌కత్తాలో ముగ్గురు నిందితుల అరెస్ట్‌ 
  • రూ.4.50 లక్షలు స్వాధీనం

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : బేకరీలో డబ్బు చోరీ చేసి బస్సులో కోల్‌కత్తాకు పారిపోతున్న ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు నెంబరు 10లోని వాక్స్‌ బేకరీలో గత వారం ఏడు లక్షల రూపాయల నగదు చోరీ అయింది. సెక్యూరిటీ గార్డు సోహిదుల్‌ అస్లాం మీద అనుమానం వ్యక్తం చేస్తూ బేకరీ నిర్వాహకుడు అమర్‌ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా సోహిదుల్‌ అస్లాంకు ఎల్‌బీనగర్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు అలిముద్దిన్‌ షేక్‌, అక్సెదుల్‌ అలీ సహకరించినట్టు తేలింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వారు బస్సులో కోల్‌కత్తా పారిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు విమానంలో కోల్‌కత్తాకు వెళ్లారు. నిందితులు బస్సులో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-23T13:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising