కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య కేసులో మరొకరు అరెస్ట్
ABN, First Publish Date - 2021-07-13T01:39:03+05:30
కేంద్ర మాజీ మంత్రి పి.రంగరాజ కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం హత్య కేసులో పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.రంగరాజ కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం హత్య కేసులో పోలీసులు మూడో అనుమానితుడిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దోచుకున్న రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉంటున్న దివంగత మాజీ మంత్రి భార్య ఇంట్లోకి ఈ నెల 6న చొరబడిన సూరజ్ కుమార్, అతడి ఇద్దరి స్నేహితులు దోపిడీకి యత్నించారు. ఈ క్రమంలో ఆమెను హత్య చేశారు. మహిపాల్పూర్కు చెందిన సూరజ్ కుమార్ వృత్తిరీత్యా డ్రైవర్. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు.
అంతకుముందు పోలీసులు మరో ఇద్దరు నిందితులైన రాజు (24), రాకేశ్ రాజ్ (34)లను అరెస్ట్ చేశారు. నిందితులు రూ. 50 లక్షల విలువైన 900 గ్రాముల బంగారం, వెండి, డైమండ్ నెక్లెస్లను దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-07-13T01:39:03+05:30 IST