ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttar Pradesh: బారాబంకీలో ట్రక్కును ఢీకొన్న బస్సు..9మంది దుర్మరణం

ABN, First Publish Date - 2021-10-07T15:40:20+05:30

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

27మంది ప్రయాణికులకు గాయాలు

బారాబంకీ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో గురువారం బస్సు,ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్న దుర్గఘటనలో 9 మంది మరణించారు.బారాబంకీ సమీపంలోని కిసాన్‌పథ్ బాబూరి గ్రామంలోని దేవ పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు.బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌కు వెళుతుండగా ఇసుక బస్తాలను తీసుకెళుతున్న లారీని ఢీకొట్టింది.గాయపడిన ప్రయాణికులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన వ్యక్తులను ట్రామా సెంటరుకు రిఫర్ చేశారు.మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .2 లక్షల పరిహారాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ .50 వేలు ఇస్తామని సీఎం చెప్పారు.అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-10-07T15:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising