ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తింటి నుంచి కూతురు పారిపోయి వచ్చిందని...

ABN, First Publish Date - 2021-07-03T14:10:25+05:30

అత్త ఇంటి నుంచి కూతురు పారిపోయి వచ్చిందనే కోపంతో పుట్టింటివారే ఆమెను దారుణంగా కొట్టి, చెట్టుకు వేలాడ తీసిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టింటి వారు దారుణానికి పాల్పడ్డారు...

అలీరాజ్‌పూర్ (మధ్యప్రదేశ్): అత్త ఇంటి నుంచి కూతురు పారిపోయి వచ్చిందనే కోపంతో పుట్టింటివారే ఆమెను దారుణంగా కొట్టి, చెట్టుకు వేలాడ తీసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బడేపూల్ తలావ్ గ్రామానికి చెందిన మహిళ సమీప గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె భర్త పని కోసం గుజరాత్ కు వెళ్లాడు. దీంతో భర్త వ్యవహారంపై అసంతృప్తి చెందిన భార్య అత్త ఇంటిని వదిలి పారిపోయి పుట్టింటికి వచ్చింది. భర్త ఇంటి నుంచి పారిపోయి వచ్చిన మహిళపై కోపంతో తండ్రి, సోదరులు కలిసి ఆమెను దారుణంగా కొట్టారు. అనంతరం మహిళను చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటనను గ్రామస్థుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. పోలీసులకు విషయం తెలిసి ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారి విజయ్ భగవావి చెప్పారు. 


Updated Date - 2021-07-03T14:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising