ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిడ్డతో కలిసి తల్లి ఆత్మాహుతి!

ABN, First Publish Date - 2021-01-10T08:22:12+05:30

తనను, కన్నబిడ్డను వదిలేసి భర్త చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని దిగులుతో ఉన్న ఆమెకు స్థానికుల సూటిపోటిమాటలు జీవితంపైనే విరక్తికలిగించేలా చేశాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భర్త మోసం.. భార్యను  వదిలేసి  పరారీ  
  • స్థానికుల మాటలు భరించలేక బలవన్మరణం

మర్పల్లి: తనను, కన్నబిడ్డను వదిలేసి భర్త చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని దిగులుతో ఉన్న ఆమెకు స్థానికుల సూటిపోటిమాటలు జీవితంపైనే విరక్తికలిగించేలా చేశాయి! కట్టుకున్నవాడు వదిలి వెళ్లిపోయినా తన మానాన తాను బతుకుతూ తన కష్టంతో బాబును పోషించుకుంటున్న ఆమె, తనను ఉద్దేశించి ఇరుగుపొరుగు అనే మాటలను భరించలేకపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు నిప్పంటించి తన ఒంటికీ అగ్గి పెట్టుకొని ప్రాణాలు విడిచింది. మంటలకు పూర్తిగా మాడిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న తల్లి, కుమారుడి మృతదేహాలను చూసి కంటతడి పెట్టని వారే లేరు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం పట్లూరులో శనివారం ఉదయం ఈ విషాదం వెలుగుచూసింది. కల్కోడకు చెందిన బోయిని నాగమ్మ-దశరథ్‌ దంపతుల ఐదుగురు సంతానంలో రెండో కూతురు అఖిల(26) ఆరేళ్ల క్రితం ఉపాధి కోసం సంగారెడ్డి జిల్లా బుధేరాకు వచ్చింది. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. అప్పట్లోనే అక్కడ ఢిల్లీకి చెందిన అమర్‌సింగ్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. వారికి రాము(3) అనే బాబు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం అమర్‌సింగ్‌, అఖిలకు చెప్పకుండా పరారయ్యాడు.


అప్పటి నుంచి భర్త కోసం ఎదురుచూస్తున్న ఆఖిల, ఇతరుల సూటిపోటి మాటలతో మనస్తాపానికి గురైంది. శుక్రవారం బుధేరా నుంచి పట్లూరులోని అమ్మమ్మ ఇంటికొచ్చింది. బాబుతో కలిసి పొలం వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న డీజిల్‌ను తనపైన, కుమారుడిపైనా పోసి నిప్పంటించుకుంది. శనివారం ఉదయం ఆమె తాత పొలానికి వెళ్లి చూడగా అఖిల, రాము మృతదేహాలు పూర్తిగా కలిపోయిన స్థితిలో కనిపించాయి. అఖిల తండ్రి దశరథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలను మోసం చేసిన అమర్‌సింగ్‌ను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, పట్లూరు గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-01-10T08:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising