chennai: గొంతు కోసుకుని వ్యాపారి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-14T12:49:17+05:30
స్థానిక వ్యాసర్పాడికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్యదర్శి, వస్త్ర వ్యాపారి హరీష్ చంద్ (55) గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాసర్పాడి ఎంకేబీ నగర్ 14వ వీధికి చెందిన హరీష్ చంద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా
అడయార్(చెన్నై): స్థానిక వ్యాసర్పాడికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్యదర్శి, వస్త్ర వ్యాపారి హరీష్ చంద్ (55) గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాసర్పాడి ఎంకేబీ నగర్ 14వ వీధికి చెందిన హరీష్ చంద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఎంకేబీ నగర్ మూడో వీధిలో ఒక వస్త్ర దుకాణాన్ని కూడా నడుపుతున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే, పెద్ద కుమార్తె నేహకు వచ్చే నెలలో వివాహం ఖాయం చేసుకున్నారు. అదే సమయంలో కరోనా కారణంగా వస్త్ర వ్యాపారం బాగా దెబ్బతింది. దీనికి తోడు అప్పులవారి నుంచి వత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కుమార్తె పెళ్ళిముహూర్తం సమీపిస్తుండటంతో డబ్బులను సమకూర్చలేక గత కొన్ని రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి వంట గదిలో కత్తితో తన గొంతును కోసుకుని పెద్దగా కేకలు వేశారు. వెంటనే భార్యాపిల్లలకు, ఇరుగుపొరుగు వారు హుటాహుటిన ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్టు నిర్థారించారు. ఎంకేబీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-10-14T12:49:17+05:30 IST