గంజాయి పట్టివేత
ABN, First Publish Date - 2021-09-19T03:05:28+05:30
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నగరంలో మియాపూర్లో పోలీసులు
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నగరంలోని మియాపూర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసారు. గంజాయిని ముంబైకి బస్లో తరలించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారు. దీంతో సురేష్, కరుణాకర్లను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-19T03:05:28+05:30 IST