ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-15T14:46:41+05:30

అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బోయినపల్లి : అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి బాపూజీనగర్‌లో నివాసం ఉండే సాయికుమార్‌చారి(31) క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. క్యాబ్‌ సరిగా నడవకపోవడంతో ప్రస్తుతం పెయింటింగ్‌ వర్క్‌ కాంట్రాక్టర్‌ దగ్గర రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బోయినపల్లిలోని ఓ ఇంట్లో కొన్ని రోజుల క్రితం పనికోసం వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో రెండు గ్రాముల బంగారు ఆభరణం పోయింది. దీంతో ఆ ఇంటి యజమాని సాయికుమార్‌చారి తీశాడని అనుమానం వ్యక్తం చేశాడు.


అవమానంగా భావించిన సాయికుమార్‌చారి సదరు ఆభరణాలకు సంబంధించిన డబ్బును ఆదివారంలోపు ఇస్తానని ఒప్పుకున్నాడు. డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మళ్లీ అవమానం పాలుకావడం భరించలేనని ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయినపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు.

Updated Date - 2021-03-15T14:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising