ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంపతుల మధ్య తగాదాలు.. ఉరేసుకున్న భర్త

ABN, First Publish Date - 2021-05-13T16:50:47+05:30

కుటుంబసభ్యులతో గొడవపడి పెయింటర్‌గా పనిచేస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అంబర్‌పేట : కుటుంబసభ్యులతో గొడవపడి పెయింటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉండే నాగరాజు(37) పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో పాటు అతని తల్లి కూడా వారితోనే ఉంటుంది. అయితే నాగరాజు అప్పుడప్పుడు మద్యం సేవించేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తగాదాలు జరిగేవి. ఈ క్రమంలో ఈనెల 12న డబ్బుల కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తన భార్యను, తల్లిని ఇంట్లోనుంచి బయటకు పంపి గది తలుపులుపెట్టుకున్నాడు.


తలుపు తెరుస్తారని వారు చాలా సేపు ఎదురుచూసినా తలుపు తెరవకపోవడంతో కిటికీలోనుంచి చూడగా ఆయన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సహకారంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే నాగరాజు మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-13T16:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising