ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య వేళ్లు నరికిన కసాయి భర్త

ABN, First Publish Date - 2021-03-27T18:15:25+05:30

చిన్న సమస్యపై గొడవపడి ఇంట్లో నిద్రపోతున్న భార్య బొటనవేలు, మూడు వేళ్లను గొడ్డలితో నరికిన కసాయి భర్త బాగోతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్) : చిన్న సమస్యపై గొడవపడి ఇంట్లో నిద్రపోతున్న భార్య బొటనవేలు, మూడు వేళ్లను గొడ్డలితో నరికిన కసాయి భర్త బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో వెలుగుచూసింది. బేతుల్ జిల్లా చిచోలి గ్రామానికి చెందిన రాజు తరచూ భార్యతో గొడప పడుతుంటాడు. వాగ్వాదంతో భార్యపై కోపంతో ఉన్న రాజు తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా ఆమె చేతి బొటనవేలు, మూడు వేళ్లను గొడ్డలితో నరికాడు. తీవ్రంగా గాయపడిన మహిళను బోపాల్ నగరంలోని హమీదియా ఆసుపత్రికి తరలించారు. భార్య వేళ్లు నరికిన భర్త రాజును పోలీసులు అరెస్టు చేశారు. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత 15రోజుల్లో ఇలాంటి మూడు దారుణ ఘటనలు జరగడంతో సీఎం శివరాజ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాగర్ జిల్లాలో మార్చి 22వతేదీ2న ఓ భర్త తన భార్య చేతులు నరికి ఆమెను అడవిలో వదిలివేశాడు. ఇలాంటి ఘోరమైన నేరాలను నివారించేందుకు వీలుగా నిందితులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలు రూపొందిస్తామని సీం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.


Updated Date - 2021-03-27T18:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising