భర్త కుటుంబ సభ్యులపై భార్య బంధువుల దాడి
ABN, First Publish Date - 2021-01-25T17:33:17+05:30
గరంలోని వనస్థలిపురంలోని శ్రీనివాసపురం కాలనీలో భర్త కుటుంబంపై భార్య బంధువులు దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలోని శ్రీనివాసపురం కాలనీలో భర్త కుటుంబంపై భార్య బంధువులు దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి. దాడిలో గాయపడిన అత్తకు గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వనస్థలిపురం సీఐ మురళీ మోహన్ కథనం ప్రకారం.. చైతన్య రెడ్డి, ధనలక్ష్మి దంపతులకు 2017లో వివాహమైంది. వీరికి ఓ పాప ఉంది. అయితే గత రెండేళ్లుగా వీరి మధ్య సంబంధాలు క్షీణించాయి. కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త కుటుంబపై భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. 498 సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది. ఈ కేసులో భర్త చైతన్య రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా భార్య బందువులు దాడికి పాల్పడ్డారు. భర్త సోదరుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన తల్లి గాయపడ్డారు.
ఇదిలా ఉంటే, అత్తింటి వేధింపులతో తాను గతంలో ఆత్మహత్యకు యత్నించానని చైతన్య భార్య ధనలక్ష్మి తెలిపింది. తన భర్త కుటుంబంపై ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదన్నది. అత్తారింటికి వస్తే ఒక్కోసారి అర్ధరాత్రి వరకు తనను, తన బిడ్డను ఇంటి బయటే పెట్టి తలుపులు వేసిన రోజులు ఉన్నాయని కన్నీరుమున్నీరైంది. పోలీసులు జోక్యంతో మళ్ళీ లోపలికి పంపేవారని బాధపడింది. తనకు న్యాయం జరగపోతే అత్తారింటి బిల్డింగ్పై నుంచి పాపతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంటానంటోంది.
Updated Date - 2021-01-25T17:33:17+05:30 IST