ఎప్పుడూ ఫోన్ చూస్తున్న కుమార్తెను తల్లి మందలించడంతో..
ABN, First Publish Date - 2021-03-22T13:55:58+05:30
ఉదయభాను ఎప్పుడూ ఫోన్ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో ...
హైదరాబాద్/జవహర్నగర్ : కార్పొరేషన్ పరిధిలోని గిరిప్రసాద్ కాలనీలో నివాసముంటున్న బోయిన రమాదేవి, నగేశ్ దంపతుల కూతురు ఉదయభాను(20) అదృశ్యమైంది. ఉదయభాను ఈసీఐఎల్ పరిధిలోని ఇంటర్ కళాశాలలో సెకండీయర్ చదువుతోంది. ఉదయభాను ఎప్పుడూ ఫోన్ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో ఉదయభాను ఇంట్లో చెప్పకుండా ఆదివారం ఉదయం వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జి సీఐ మధుకుమార్ తెలిపారు.
Updated Date - 2021-03-22T13:55:58+05:30 IST