ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Towel తెచ్చివ్వలేదని భార్యను ఇలా...

ABN, First Publish Date - 2021-11-08T22:38:09+05:30

కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: స్నానం చేశాక టవల్ అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఓ భర్త రెచ్చిపోయాడు. పారతో ఆమె తలపై బాది హతమార్చాడు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాజ్‌కుమార్ బాహే అటవీశాఖలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. 


ఆదివారం సాయంత్రం బాత్రూములో దూరిన అతడు స్నానం అనంతరం టవల్ తెచ్చివ్వమని భార్యను అడిగాడు. అయితే, ఆ సమయంలో వంట పాత్రలు శుభ్రం చేస్తున్న ఆమె కాసేపు ఆగాలని కోరింది. అంతే, ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్‌కుమార్ బయటకు వచ్చిన పారతో తన భార్య పుష్పాబాయి (45) తలపై గట్టిగా మోదాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. 


తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన 23 ఏళ్ల కుమార్తెను కూడా బెదిరించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-08T22:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising