నలుగురు బైక్ దొంగల అరెస్టు
ABN, First Publish Date - 2021-09-14T02:12:20+05:30
జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు
పశ్చిమ గోదావరి: జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసారు. భీమవరంలో బాలుడు సహా నలుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 31 బైక్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మొగల్తూరు కు చెందిన పవన్ కుమార్, కృపావరం, వీరవాసరానికి చెందిన చంద్రరావులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-14T02:12:20+05:30 IST