భవనం పైనుంచి కుక్కను పడేసి చంపిన వారిపై కేసు
ABN, First Publish Date - 2021-07-02T18:22:50+05:30
భవనం మూడో అంతస్తు నుంచి కుక్కను రోడ్డుపైకి విసిరి వేయడంతో అది మరణించిన ఘటన...
న్యూఢిల్లీ :భవనం మూడో అంతస్తు నుంచి కుక్కను రోడ్డుపైకి విసిరి వేయడంతో అది మరణించిన ఘటన న్యూఢిల్లీలోని లాజ్పత్ నగర్ -4 వద్ద జరిగింది. డిఫెన్సుకాలనీలో మూడో అంతస్తులోని ఓ భవనం నుంచి కుక్కను రోడ్డుపైకి విసిరి వేయడం వల్ల కుక్క మరణించిందని లాజ్ పత్ నగర్ వాసి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెంపుడు జంతువుల క్లినిక్ నడుపుతున్న ఫిర్యాదు దారుడు డిఫెన్సుకాలనీకి రాగా రక్తపుమడుగులో కుక్క మరణించి కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఐపీసీ 429 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుక్క మృతి ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
Updated Date - 2021-07-02T18:22:50+05:30 IST