బాలికలపై తండ్రీకొడుకుల అకృత్యం..
ABN, First Publish Date - 2021-09-15T00:08:41+05:30
విశాఖ : అచ్యుతాపురం మండలంలో దారుణం జరిగింది. బాలికలపై తండ్రీకొడుకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలు నేర్పిస్తాం అంటూ ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
విశాఖ : అచ్యుతాపురం మండలంలో దారుణం జరిగింది. బాలికలపై తండ్రీకొడుకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలు నేర్పిస్తాం అంటూ ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పాపయ్య(50), నూకరాజు(27) తండ్రీకొడుకులు. వారి ఇంటికి సమీపంలోని బాలికలను.. మాయమాటలు చెప్పి నమ్మించి, పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు సమాచారం.
కడుపునొప్పి తీవ్రంగా ఉండడంతో మంగళవారం కుటుంబ సభ్యులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అచ్చతాపురం పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించారు. బాధిత బాలికలను చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2021-09-15T00:08:41+05:30 IST