ఢిల్లీలో ఈ-రిక్షాను ఢీకొన్న కారు...ఇద్దరి దుర్మరణం
ABN, First Publish Date - 2021-06-15T14:39:31+05:30
డ్రైవరు పీకలదాకా మద్యం తాగి కారు నడపటం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన...
న్యూఢిల్లీ : డ్రైవరు పీకలదాకా మద్యం తాగి కారు నడపటం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగింది.ఢిల్లీలోని డిలైట్ సినిమా హాలు వద్ద డ్రైవరు మద్యం తాగి కారును వేగంగా నడుపుతూ ఓ కుటుంబం ప్రయాణిస్తున్న ఈ-రిక్షాను ఢీకొట్టాడు.ఈ రోడ్డు ప్రమాదంలో ఈ రిక్షా డ్రైవరుతోపాటు ఓ మహిళ మరణించారు. ఈ-రిక్షాలో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు పారిపోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. మద్యం తాగి కారును వేగంగా నడపటం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
Updated Date - 2021-06-15T14:39:31+05:30 IST