ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షుద్రపూజ అనుమానం.. ఆరేళ్ల పిల్లాడి పీకపిసికి చంపేసిన దంపతులు!

ABN, First Publish Date - 2021-02-06T10:31:32+05:30

మూఢనమ్మకాలతో కళ్లు మూసుకుపోయి, ఎదుటి వారి ప్రాణాలు తీయడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే తరహా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మూఢనమ్మకాలతో కళ్లు మూసుకుపోయి, ఎదుటి వారి ప్రాణాలు తీయడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లాకు చెందిన ఓ జంట ఓ గేదెను పెంచుకుంటోంది. కొన్ని రోజుల క్రితం ఈ గేదె అకస్మాత్తుగా మృత్యువాత పడింది.


తమ కుటుంబంపై ఎవరో క్షుద్రపూజలు చేయించారని వాళ్లు అపోహ పడ్డారు. అంతే తమకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ కుటుంబానికి చెందిన ఓ ఆరేళ్ల పసివాడిపై తమ కోపాన్ని ప్రదర్శించారు. పసివాడి పీక పిసికి దారుణంగా హతమార్చారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ స్కూలు దగ్గరలో మృదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత దీన్ని చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

Updated Date - 2021-02-06T10:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising