ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగా చేస్తూ ఆశ్రమం పైనుంచి పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-18T21:59:56+05:30

యోగా చేస్తూ ఆశ్రమం పైనుంచి పడి వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: కొలంబియా దేశానికి చెందిన ఓ వ్యక్తి యోగా చేస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని చికిత్స తీసుకుంటున్న క్రమంలో మరణించాడు. ఒమర్ అర్లనోకాతిలోక్స్‌ అనే ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఉన్న యుగల్ భజన్ కుటి అనే ఆశ్రమంలో కొద్ది సంవత్సరాలుగా ఉంటున్నాడు. అయితే ఆదివారం ఆశ్రమం పైన యోగా చేస్తున్న క్రమంలో కాలు జారి కిందపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ సరైన వైద్యం లేకపోవడంతో ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సదరు ఆసుపత్రి వైద్యులు సూచించారు. అక్కడి నుంచి వేరే ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఒమర్ మరణించాడు.


కాగా, అతడి దహన సంస్కారాలను హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నట్లు అతడితో పాటు ఆశ్రమంలో ఉంటున్న మరియా క్రిష్ణ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఇక ఒమర్ మరణ వార్త విషయాన్ని కొలంబియా ఎంబసీతో పాటు అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు క్రిష్ణ తెలిపాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు.

Updated Date - 2021-05-18T21:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising