ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కడపల్లి హత్యకేసులో ఇంకా వీడని మిస్టరీ?

ABN, First Publish Date - 2021-04-06T12:20:39+05:30

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సద్నామ్‌సింగ్‌ హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/చిక్కడపల్లి : చిక్కడపల్లి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని సూర్యానగర్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సద్నామ్‌సింగ్‌ హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈనెల 1న తెల్లవారుఝామున ఈ హత్య జరగగా, 5రోజులైనా హత్య కేసు చిక్కుముడి వీడలేదు. ఈ కేసులో రెండు ప్రత్యేకబృందాలు హతుడి సొంత రాష్ట్రమైన పంజాబ్‌తోపాటు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.


సద్నామ్‌సింగ్‌ అన్నకొడుకు నిషాంత్‌సింగ్‌ జాడ తెలియకపోవడంతో పోలీసులు అతనికోసం విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితుని ఫోన్‌ లొకేషన్‌ టాప్‌ చేయడానికి కూడా యత్నిస్తున్నారు. ఒక్కసారి అతను దొరికితే హత్య చిక్కుముడి అంతా విడిపోతుందని సీఐ శివశంకరరావు పేర్కొంటున్నారు. ఘటన స్థలంలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే హత్య జరిగిన రోజు నిషాంత్‌సింగ్‌ హత్య జరిగిన ఇంటినుంచి బయటకు వెళ్లినట్లు కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. నిషాంత్‌సింగ్‌ దొరికితే హత్యకు గల కారణాలు వస్తాయంటున్నారు. 

Updated Date - 2021-04-06T12:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising