ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra : బ్యాంకు దోపిడీకి మాజీ మేనేజర్ యత్నం..ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-07-30T17:31:47+05:30

ముంబై నగర సమీపంలో విరార్ సబర్బన్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో అప్పుల్లో మునిగిన ఓ మాజీ మేనేజరు దోపిడీకి యత్నించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరొకరికి గాయాలు

ముంబై (మహారాష్ట్ర): ముంబై నగర సమీపంలో విరార్ సబర్బన్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో అప్పుల్లో మునిగిన ఓ మాజీ మేనేజరు దోపిడీకి యత్నించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. విరార్ సబర్బన్ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు గురువారం రాత్రి మాజీ మేనేజర్ వచ్చి దోపిడీకి యత్నించాడు. అడ్డుకున్న ప్రస్థుత బ్యాంకు మేనేజరు యోగితావార్తక్(34, క్యాషియర్ శ్వేతా దేవుఖ్ (32)లను కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మేనేజరు యోగితా మరణించగా, క్యాషియర్ శ్వేతా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకులో గొడవ విన్న వీధిలోని ప్రజలు వచ్చిన నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాయపడిన శ్వేతాను ఆసుపత్రికి తరలించారు. యోగితా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.నిందితుడికి భారీగా అప్పులున్నాయని, అవి తీర్చేందుకే బ్యాంకు దోపిడీకి యత్నించాడని పోలీసులు చెప్పారు. విరార్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302,307, 397 లకింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-07-30T17:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising