ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కోసం యువతి ప్లాన్.. డౌట్ రాకుండా ఓ కిడ్నాప్.. చివరికి..

ABN, First Publish Date - 2021-03-07T01:29:20+05:30

బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు అతడితో పాటూ ఇంటి నుంచి పరారైంది. తాము పారిపోయిన జంట అని ఎవరికీ అనుమానం రాకుండా ఓ కిడ్నాప్‌ కూడా చేసింది. వ్యూహం బెడిసికొట్టడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలంధర్: బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు అతడితో పాటూ ఇంటి నుంచి పరారైంది. తాము పారిపోయిన జంట అని ఎవరికీ అనుమానం రాకుండా ఓ కిడ్నాప్‌ కూడా చేసింది. వ్యూహం బెడిసికొట్టడంతో చివరికి ఆ జంట జైలు పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నిషు ద్వివేదీ(20) మంగళవారం నాడు మూడేళ్ల  బంధువుల కూతురిని(3) కిడ్నాప్ చేసింది. ఆమెను తీసుకుని జలంధర్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లింది. వేరే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలనేది వారి ప్లాన్. 


ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు హోటళ్లలో నివసించాల్సి ఉంటుంది కాబట్టి తమకు తోడుగా ఆ చిన్నారి ఉంటే ఎవరికీ ఎటువంటి అనుమానం కలగదని నిషూ భావించింది. తమను చూసి అందరూ పెళ్లైన జంట అనుకుని పెద్దగా పట్టించుకోరని భావించింది. అయితే.. బిడ్డ కనబడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టి ఆ జంటను జలంధర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే..పాపకు హానీ తలపెట్టే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని పోలీసులకు తెలిపిందట. పోలీసులు ఆ జంటపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-07T01:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising