కల్లు దొరక్క.. పురుగుల మందు తాగింది
ABN, First Publish Date - 2021-01-13T08:37:22+05:30
కల్లు తాగే అలవాటున్న ఓ మహిళ అది దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోయి పురుగుల మందు తాగింది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామానికి చెందిన సుమిత్ర(35)కు కల్లు తాగే
వికారాబాద్ జిల్లాలో మతిస్థిమితం కోల్పోయిన మహిళ
వికారాబాద్, (ఆంధ్రజ్యోతి): కల్లు తాగే అలవాటున్న ఓ మహిళ అది దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోయి పురుగుల మందు తాగింది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామానికి చెందిన సుమిత్ర(35)కు కల్లు తాగే అలవాటుంది. కల్తీ కల్లు తాగి వందలాది మంది అస్వస్థతకు గురవడం.. ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాలను సీజ్ చేయడంతో నాలుగైదు రోజులుగా కల్లు దొరకడం లేదు. దీంతో మతిస్థిమితం కోల్పోయిన సుమిత్ర మంగళవారం పురుగుల మందు తాగింది. కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా.. కల్తీ కల్లు ప్రభావంతో అస్వస్థతకు గురైన వారిని కలెక్టర్ పౌసమి బసు పరామర్శించారు.
Updated Date - 2021-01-13T08:37:22+05:30 IST