ఫోన్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న యువతి
ABN, First Publish Date - 2021-04-17T21:28:03+05:30
దొంగల నుంచి ఫోన్ కాపాడుకోవడానికి ప్రయత్నించి ఓ యువతి తన ప్రాణాలనే పొగొట్టుకుంది. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. రజని అనే 21 సంవత్సరాల యువతి ఆటోలో వెళ్తుండగా మోటర్ సైకిల్పై వచ్చిన దొంగలు ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు
పంజాబ్: దొంగల నుంచి ఫోన్ కాపాడుకోవడానికి ప్రయత్నించి ఓ యువతి తన ప్రాణాలనే పోగొట్టుకుంది. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. రజనీ అనే 21 సంవత్సరాల యువతి ఆటోలో వెళ్తుండగా మోటర్ సైకిల్పై వచ్చిన దొంగలు ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. అపుడు రజనీ వాళ్లను నెట్టేసేందుకు ప్రయత్నించినప్పటికీ దొంగలు ఫోన్ను బలవంతంగా లాగారు. దీంతో ఆమె ఆటోలో నుంచి కింద పడింది. తలకు బలమైన గాయమై తీవ్రరక్తస్రావంతో అక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-04-17T21:28:03+05:30 IST