లాభాలతో ముగిసిన మార్కెట్లు!
ABN, First Publish Date - 2021-04-22T21:15:43+05:30
నష్టాలతో రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి.
నష్టాలతో రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కాస్త ఊరటనిచ్చాయి. 47,501 వద్ద ఈ రోజు (గురువారం) ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 374 పాయింట్లు లాభపడి 48,080 వద్ద రోజును ముగించింది. ఒక దశలో 47,204 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత కోలుకుంది.
ఇక, 14,219 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ 109 పాయింట్ల ఎగబాకి 14,406 వద్ద రోజును ముగించింది. ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ లాభాలను ఆర్జించాయి. టైటాన్ కంపెనీ, శ్రీ సిమెంట్స్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, హెచ్యూఎల్ నష్టాలను చవిచూశాయి.
Updated Date - 2021-04-22T21:15:43+05:30 IST