నష్టాలతో ప్రారంభమై.. లాభాల్లోకి!
ABN, First Publish Date - 2021-04-09T15:42:18+05:30
నష్టాలతో రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి.
నష్టాలతో రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి. లాభాల దిశగా సాగుతున్నాయి. 49,743 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఒక దశలో 200కు పైగా పాయింట్లను కోల్పోయింది. ఆ తర్వాత కోలుకుని ఉదయం పది గంటల సమయానికి 45 పాయింట్లు లాభపడింది. ఇక, 14,883 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఉదయం పది గంటల సమయానికి 10 పాయింట్లు ఎగబాకింది. టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, హెచ్యూఎల్, సన్ ఫార్మా లాభాలను ఆర్జిస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, శ్రీ సిమెంట్స్, ఎన్టీపీసీ నష్టాల బాట పట్టాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మైక్రో లాక్డౌన్లు తప్పవని ప్రధాని మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Updated Date - 2021-04-09T15:42:18+05:30 IST