మార్కెట్లోకి పెరుగును విడుదల చేసిన సిద్స్ ఫార్మ్
ABN, First Publish Date - 2021-07-22T22:52:03+05:30
ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ సిద్స్ ఫార్మ్ తాజాగా మార్కెట్లోకి ఆవు, గేదె పాల పెరుగును విడుదల చేసింది.
హైదరాబాద్: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ సిద్స్ ఫార్మ్ తాజాగా మార్కెట్లోకి ఆవు, గేదె పాల పెరుగును విడుదల చేసింది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా వీటిని తయారు చేసినట్లు తెలిపింది. 475 గ్రాముల ప్యాక్తో కూడిన గేదె పాల పెరుగు ధర రూ 80గా ఉండగా, ఆవు పాల పెరుగు ధర రూ. 70గా ఉంది. ఈ సందర్భంగా సిద్స్ ఫార్మ్ ఫౌండర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ.. ‘‘మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర పెరుగు, యోగార్ట్ల్లా కాకుండా సిద్స్ ఫార్మ్ విడుదల చేసిన పెరుగులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు. ఇళ్లలో చేసే కమ్మటి పెరుగు రుచినే ఇది కూడా కలిగి ఉంటుంది. పాల పదార్ధాలలో ఎక్కువ మంది అభిమానించేది పెరుగు అని మా కంపెనీ నమ్ముతుంది. అంతేకాదు, పాలతో పోలిస్తే పెరుగు త్వరగా జీర్ణమవుతుంది. అందువల్ల ఏ వయసు వారైనా దీనిని తినవచ్చు.’’ అన్నారు.
Updated Date - 2021-07-22T22:52:03+05:30 IST