రూపే డేటా మరింత సేఫ్...
ABN, First Publish Date - 2021-10-22T04:26:13+05:30
రూపే కార్డుల్లో డేటా ఇకపై మరింత సురక్షితంగా ఉండనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ క్రమంలో... ఏర్పాట్లు చేస్తోంది. మర్చంట్ల వద్ద కార్డు వివరాలను భద్రపరిచేందుకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థను వినియోగిస్తారు.
ముంబై : రూపే కార్డుల్లో డేటా ఇకపై మరింత సురక్షితంగా ఉండనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ క్రమంలో... ఏర్పాట్లు చేస్తోంది. మర్చంట్ల వద్ద కార్డు వివరాలను భద్రపరిచేందుకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థను వినియోగిస్తారు. దీంతో కస్టమర్ల వివరాలకు మరింత గోప్యత, భద్రత ఉంటుంది. అలాగే కొనుగోళ్లు సులభమవుతాయి. ఎన్క్రిప్టెడ్ రూపంలో ఖాతాదారుల సమాచారాన్ని టోకెన్ రూపంలో భద్రపరచడంతోలావాదేవీలకు భద్రత ఏర్పడుతుంది. ఖాతాదారుల వివరాలను వెల్లడించకుండానే చెల్లింపు ప్రక్రియకు ఈ టోకెన్లు వీలు కల్పిస్తాయి. ఎన్పీసీఐ టోకెనైజేషన్ ప్రక్రియ నేపధ్యంలో... బ్యాంకులు, అగ్రిగేటర్లు, మర్చంట్లు, ఇతరులు ఎన్పీసీఐ వద్ద ధృవీకరణపత్రం పొందితే టోకెన్ రిక్వెస్టర్ పాత్రను పోషించవచ్చు.
రూపే కార్డు వినియోగదారులు భవిష్యత్తులో చేసే లావాదేవీలకు ఈ అన్ని వ్యాపారవర్గాలు తమ రూపే ఖతాదారుల టోకెన్ రిఫరెన్స్ ఆన్ఫైల్ ను వినియోగించుకోవచ్చు. ఈ పారదర్శక వ్యవస్థ కారణంగా ఖాతాదారుల సమాచారం లీక్ కాదు. చెల్లింపు ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. ఈ విధానంలో ఖాతాదారులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎన్క్రిప్టెడ్ టోకెన్ రూపంలో నిల్వ ఉంటుంది. దీంతో షాపింగ్ చేసిన ప్రతిసారి కస్టమర్ వారి సమాచారం అందించే అవసరముండదు. అలాగే ఖాతాదారులకు సంబంధించిన సమాచారం పేమెంట్ ఇంటర్మీడియేటరీలు స్టోర్ చేసే వీలు ఉండదు.
Updated Date - 2021-10-22T04:26:13+05:30 IST