ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓలా, ఉబెర్ అంత పని చేశాయా?.. కేంద్రం దర్యాప్తు!

ABN, First Publish Date - 2021-01-13T01:18:30+05:30

ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీలు ఓలా, ఉబెర్లపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ రెండు సంస్థలు జీఎస్టీ కట్టకుండా ఎగవేశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీలు ఓలా, ఉబెర్లపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ రెండు సంస్థలు జీఎస్టీ కట్టకుండా ఎగవేశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) తెలిపింది. ఈ రెండూ కంపెనీలు తమ డ్రైవర్లకు ఇచ్చే ఇన్సెంటివ్స్‌పై జీఎస్టీ కట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కస్టమర్లు తమ రైడ్లు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వారికి వేసే ఫైన్ల ద్వారా ఆర్జించే సంపదపై కూడా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంస్థలపై దర్యాప్తు చేపట్టాలని డీజీజీఐ నిర్ణయించింది. కాగా, ఈ పన్ను సంబంధిత సందేహాలపై అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, వారికి అన్ని రకాలుగా సహకరిస్తున్నామని ఉబెర్ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.

Updated Date - 2021-01-13T01:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising