పోర్టబుల్ వెంటిలేటర్ ‘స్వస్థ్ వాయు’
ABN, First Publish Date - 2021-05-06T06:31:56+05:30
దేశీయంగా అభివృద్ధి చేసిన స్వస్థ్ వాయు నాన్ ఇన్వాజివ్ వెంటిలేటర్ను హైదరాబాద్కు చెందిన అపోలో కంప్యూటింగ్ లాబ్స్ విడుదల చేసింది...
హైదరాబాద్: దేశీయంగా అభివృద్ధి చేసిన స్వస్థ్ వాయు నాన్ ఇన్వాజివ్ వెంటిలేటర్ను హైదరాబాద్కు చెందిన అపోలో కంప్యూటింగ్ లాబ్స్ విడుదల చేసింది. 3 కిలోల కన్నా తక్కువ బరువు, ఒక బ్రీఫ్కేసు పరిమాణంలో ఉండే ఈ పరికరాన్ని ఇళ్లలోను, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లోను కరోనా బాధితులకే కాకుండా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి కూడా తేలిగ్గా ఉపయోగించవచ్చునని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే ఈ తరహా పరికరం ఇదేనని పేర్కొంది. సీఎ్సఐఆర్ భాగస్వామ్యంలో దీన్ని తయారుచేశామని, దాని భద్రతను ఎన్ఏబీఎల్ అక్రెడిషన్ గల ల్యాబ్లు ధ్రువీకరించాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరుల్లోకి కొన్ని ఆస్పత్రుల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బద్దం జైపాల్రెడ్డి తెలిపారు.
Updated Date - 2021-05-06T06:31:56+05:30 IST