ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రో ధరలు

ABN, First Publish Date - 2021-05-06T12:48:41+05:30

దేశంలో ఎన్నికల పర్వం ముగియగానే కేంద్రం వరుసగా మూడోరోజు పెట్రో ధరలపై అదనపు భారం వేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికల పర్వం ముగియగానే కేంద్రం వరుసగా మూడోరోజు పెట్రో ధరలపై అదనపు భారం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం నాడు పెట్రోల్ లీటరు ధరపై 25 పైసలు, డీజిల్ ధరపై 30  పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం లీటరు పెట్రోలు ధర 23 పైసలు పెంచారు.  దీంతో హైదరాబాద్ లీటరు పెట్రోల్ ధర 94.57 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు గురువారం నాడు 31 పైసలు పెరగ్గా, 88.77 రూపాయలకు ఎగబాకింది. మూడు రోజులుగా పెట్రోలు ధరలు పెరుగుదలతో వాహనచోదకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు ధరలు పెరగడంతో మూడో రోజు కూడా పెట్రో ధరలు పెంచామని చమురు సంస్థలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల దేశంలో పెట్రో విక్రయాలు 7 శాతం తగ్గాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా నగరాల్లోనూ చమురు ధరలు మూడోరోజు పెరిగాయి. 

Updated Date - 2021-05-06T12:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising