ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంట్రల్‌ బ్యాంక్‌ సీఈఓగా మఠం వెంకటరావు

ABN, First Publish Date - 2021-03-02T06:34:29+05:30

ప్రభుత్వ రంగంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మఠం వెంకటరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆయన కెనరాబ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మఠం వెంకటరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆయన కెనరాబ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుం చి మూడేళ్లు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఏది ముందు ఏర్పడితే అంతవరకు ఆయన కొత్త పదవిలో ఉంటారని రెగ్యులేటరీ సంస్థలకు బ్యాంక్‌ తెలిపింది. 


వెంకటరావు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పట్టా పొందారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌ సర్టిఫైడ్‌ అసోసియేట్‌గా ఉన్నారు. 1988లో అలహాబాద్‌ బ్యాంక్‌లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కెరీర్‌లో భాగంగా దేశంలోని పలు ప్రదేశాల్లో కీలక పదవులు నిర్వహించారు. 

Updated Date - 2021-03-02T06:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising