ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుతి కార్లు మరింత ప్రియం

ABN, First Publish Date - 2021-04-17T06:39:52+05:30

దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మళ్లీ ధరలు పెంచేసింది. ఎంపిక చేసిన మోడల్‌ కార్ల ధరను శుక్రవారం నుంచి రూ.22,500 వరకు పెంచినట్లు తెలిపింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపిక చేసిన మోడళ్లపై రూ.22,500 వరకు పెంపు 


న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మళ్లీ ధరలు పెంచేసింది. ఎంపిక చేసిన మోడల్‌ కార్ల ధరను శుక్రవారం నుంచి రూ.22,500 వరకు పెంచినట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కొంత భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. ఈ విడతలో సెలెరియో, స్విఫ్ట్‌ మినహా మిగతా మోడల్‌ కార్ల ధరలు పెరిగాయి. ఢిల్లీ షోరూమ్‌ల్లో వీటి ధరల పెరుగుదల సగటు 1.6 శాతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మారు తి సుజుకీ ఆల్టో నుంచి ఎస్‌-క్రాస్‌ వరకు పలు మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఢిల్లీ షోరూమ్‌ల్లో వీటి ధర రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షల స్థాయిలో ఉంది. ఈ జనవరి 18న కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడళ్ల ధరను రూ.34,000 వరకు పెంచింది. 

Updated Date - 2021-04-17T06:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising