ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాన్ నుంచి Kiwi fruits దిగుమతిపై నిషేధం

ABN, First Publish Date - 2021-12-14T18:05:53+05:30

ఇరాన్ దేశం నుంచి కివీ పండ్ల దిగుమతిని భారత ప్రభుత్వం నిషేధించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇరాన్ దేశం నుంచి కివీ పండ్ల దిగుమతిని భారత ప్రభుత్వం నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు ఇరాన్ దేశం నుంచి దిగుమతి అవుతుండటంతో భారతదేశం దీన్ని నిషేధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారతదేశంలో 22 సరుకుల్లో తెగులు వచ్చింది. ఇరాన్ నుంచి తెగులు దేశంలోకి వస్తుండటంతో కేంద్ర వ్యవసాయమంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఈ నెల 7వతేదీ నుంచి కివీ పండ్ల దిగుమతిని నిషేధించింది. కివీ పండ్లను తమ దేశానికి పంపించవద్దని భారత్ ఇరాన్ సర్కారుకు తెలిపింది. కివీ పండ్ల ద్వారా తెగులు దేశంలోకి వస్తుందని పలుసార్లు భారత్ ఇరాన్ దేశానికి హెచ్చరికలు చేసింది. 


అయినా ఇరాన్ పట్టించుకోక పోవడంతో దిగుమతులపై భారత్ నిషేధాస్త్రం విధించింది. భారతదేశం 4,000 టన్నుల కివీ పండ్లను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కివీ పండ్ల దిగుమతిపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించడంతో దేశంలో దీని ధరలు ఆకాశన్నంటనున్నాయి.

Updated Date - 2021-12-14T18:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising