ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు నెలలలు... 22 ఐపీవోలు...

ABN, First Publish Date - 2021-04-23T01:05:37+05:30

కిందటి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో ఐపీవోల హవా నడిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కిందటి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో ఐపీవోల హవా నడిచింది. ఏకంగా 22 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. వీటి విలువ దాదాపు రూ. 19 వేల కోట్లు లేదా 2.5 బిలియన్ డాలర్లకు పైనే. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు వచ్చిన ఐపీఓలను చూస్తే సంఖ్యాపరంగా ప్రపంచంలో భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది.


ఈవై ఇండియా ఐపీవో నివేదిక ప్రకారం... కన్స్యూమర్ ప్రోడక్ట్స్, రిటైల్, బహుళార్ధ పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమోటివ్, ట్రాన్స్‌పొర్టేషన్ రంగాలకు చెందిన సంస్థలు స్టాక్ మార్కెట్‌లోకి అధికంగా వచ్చాయి. ఐదు చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. వీటిలో భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్ప్ ఐపీవో అతిపెద్దది. ఈ ఇష్యూ విలువ రూ. 4,740 కోట్లు. ఈ ఏప్రిల్-జూన్ కాలంలోను ఐపీవోలు భారీగానే వస్తాయనే అంచనాలున్నాయి.  ప్రధాన మార్కెట్‌లో 17 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా, గతేడాది తొలి త్రైమాసికంలో ఒక్క కంపెనీ మాత్రమే ఐపీఓకు రావడం గమనార్హం.


గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో పది కంపెనీలు ఆఫరింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మరో ఇరవై కంపెనీలు ఐపీఓకు వచ్చే అవకాశముంది. మరో 30 కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లు వాటాలను ఉపసంహరించుకునే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-04-23T01:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising